గ్యాంగ్ రేప్... అవమాన భారంతో బాలిక ఆత్మహత్య..!

గురువారం, 5 మార్చి 2015 (15:50 IST)
హర్యానా రాష్ట్రంలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మృగాళ్ల చేతిలో బలిపసువైన ఓ బాలిక అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. అక్కడి ఫిబ్రవరి నెల ఆరోతేదిన సోనేపట్ జిల్లాలోని గొహానా నగరానికి చెందిన ఓ బాలికపై కొందరు సామూహితక అత్యాచానికి పాల్పడ్డారు.
 
అయితే పోలీసులు మాత్రం కేవలం ఒక్కరిమీదే కేసు పెట్టి, దాన్ని కేవలం 'అత్యాచారం' కేసుగా మార్చడంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురైందని, తనకు న్యాయం జరగడం లేదన్న ఆవేదనతోనే ఆమె ప్రాణాలు తీసుకుందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
పోలీసులు ఆమె వాంగ్మూలం పత్రాన్ని ఫోర్జరీ చేశారని, నిందితుల్లో చాలామంది స్వేచ్ఛగా బయటే తిరుగుతున్నారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది.

వెబ్దునియా పై చదవండి