శివరాత్రి ఉత్సవాల్లో తప్పిపోయి.. గ్యాంగ్ రేప్‌కు గురైంది..!

శుక్రవారం, 20 ఫిబ్రవరి 2015 (16:30 IST)
శివరాత్రి ఉత్సవాల్లో తప్పిపోయింది. కానీ కామాంధుల బారిన పడింది. శివరాత్రి పర్వదినం నాడు ఉత్సవాలకు వచ్చి తనవారి నుంచి తప్పిపోయిన 15 సంవత్సరాల అమ్మాయిపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో జరిగింది. 
 
ఘటనకు పాల్పడిన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, మిగతా వారికోసం గాలింపు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. శ్యాంపూర్‌కు సమీపంలోని ఒక నిర్జన ప్రాంతంలో అచేతనంగా పడివున్న బాలికను గుర్తించిన పోలీసులు వైద్య పరీక్షలకోసం ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి