గోవా అసెంబ్లీ సాక్షిగా ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, అధికార బీజేపీని ఇరకాటంలోకి నెట్టాయి. ప్రధాని నరేంద్ర మోడీ భారత దేశాన్ని హిందూ దేశంగా మారుస్తారనే నమ్మకం తనకు ఉందంటూ నిండు సభలో ఆయన వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయానికి మోడీని అభినందిస్తూ చేసిన తీర్మానం సందర్భంగా దీపక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం దీపక్ మీడియాతో మాట్లాడుతూ అలా (హిందూ దేశంగా) చేయడం అవసరం అని అన్నారు. అన్ని జాతి ధర్మాలను ఏకతాటిపై తేవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఒకే హిందూస్థాన్ ఉందని, మరో హిందూస్థాన్ లేదని ఆయన అన్నారు.