రాంపాల్ బాబాకు ఈనెల 28వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ!

గురువారం, 20 నవంబరు 2014 (17:31 IST)
హర్యానాకు చెందిన వివాదాస్పద స్వామి రాంపాల్ బాబాకు చండీగఢ్ - హర్యానా హైకోర్టు ఈనెల 28వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీని విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం అరెస్టు చేసిన రాంపాల్ బాబాను గురువారం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుపై తదుపరి విచారణను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఈనెల 28కి వాయిదా వేసింది.
 
రాంపాల్ అరెస్ట్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని హర్యానా డీజీపీని కోర్టు ఆదేశించింది.  బర్వాలాలోని రాంపాల్ ఆశ్రమం వద్ద ఎంత నష్టం జరిగింది, ఎంతమంది గాయపడ్డారు.. ఎంత మంది చనిపోయారు, ఆశ్రమం నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఆస్తినష్టంకు సంబంధించిన వివరాలు అఫిడవిట్‌లో పొందుపర్చాలని సూచించింది. 

వెబ్దునియా పై చదవండి