గుజరాత్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్త నల్లగా ఉన్నాడనీ అతనిని కడతేర్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కిరాతక చర్య వివరాలను పరిశీలిస్తే... గుజరాత్కు చెందిన ఫర్జానా (22) అనే మహిళ ఫరూక్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈయన పుట్టుకతోనే నలుపు. నల్లగా ఉన్నాడన్న కారణంతో అతనంటే అయిష్టత కనబర్చే ఫర్జానా చివరికి హత్యకు తెగించింది.
మరుసటి రోజు ఉదయాన్నే కుటుంబ సభ్యులు ఫరూక్ కోసం వెదకడం మొదలుపెట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పెట్లాద్ పోలీసులకు భార్య ఫర్జానా తీరు సందేహాలకు తావిచ్చింది. తొలుత బుకాయించిన ఆమె పోలీసుల లై డిటెక్టర్ పరీక్ష చేస్తామని చెప్పడంతో నేరం అంగీకరించింది. దీంతో, ఐపీసీ సెక్షన్ 302 కింద ఆమెపై కేసు నమోదు చేశారు.