గురుదాస్ పూర్ ఉగ్రదాడిపై కేంద్ర హోంశాఖ ప్రకటన చేయాలంటూ లోక్సభ ప్రారంభమైన వెంటనే విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వెంకయ్య స్పందిస్తూ ఈ అంశంపై చర్చకు కూడా సిద్ధమని స్పష్టంచేశారు. దేశభద్రతకు సంబంధించిన అంశంపై రాజకీయం చేయడం సరికాదని ప్రతిపక్షాలకు సూచించారు.