ముఖ్యగా 2011లో వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో పాక్ ఉగ్రవాదులు మన దేశంలో పలుచోట్ల దాడులకు పాల్పడ్డారు. ఏకంగా, దేశ పార్లమెంట్పైనే దాడికి పాల్పడ్డారు. అయితే, ఈ దాడి అనంతరం వాజ్పేయి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించలేదని పలు విమర్శలొచ్చాయి.
కానీ, తాజాగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ సెక్టార్లో భారత ఆర్మీ శిబిరంపై పాక్ ప్రేరేపిత ముష్కర మూకలు దాడి చేశాయి. అలాగే, కాల్పుల విరమణ నిబంధనలను పాక్ ఉల్లంఘించడం వంటి కవ్వింపు చర్యలకు పాల్పడింది.
వీటిని సమర్థంగా తిప్పికొట్టడంతో పాటు ప్రధాని మోడీ వ్యూహాత్మక సహనం పాటించిన భారత్, బుధవారం అర్థరాత్రి నియంత్రణ రేఖ వెలుపల ఉన్న ఉగ్రవాద శిబిరాలను, ఉగ్రవాదులను భారత్ సైన్యం మట్టుబెట్టింది. పాక్ దుశ్చర్యలకు తగు విధంగా బుద్ధి చెప్పే విషయంలో నాటి ప్రధాని అటల్ జీ చేయలేని పనిని, ఇపుడు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ చేసి చూపించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.