కాగా, 40 ఏళ్ల పాటు ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా పని చేసిన ఆయన 20 ఏళ్ల క్రితం బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్రమోదీకి మంచి స్నేహితుడు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన ఖట్టర్ ముఖ్యమంత్రి అయ్యారు. మంగళవారం చండీగఢ్లో సమావేశం అయిన హర్యానా బీజేపీ శాసనసభపక్ష సమావేశం ఖట్టర్ను తన నాయకుడుగా ఎన్నుకుంది.
హర్యానా కొత్త సీఎం ఎంపిక కోసం పరిశీలకుడుగా కేంద్రపట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం వెళ్లగా, రావ్ ఇంద్రజిత్ సింగ్, రామ్ విలాస్ శర్మ, ధన్కర్, కెప్టెన్ అభిమన్యు తదితరులు పోటీపడ్డారు. అయితే పదవి మాత్రం ఖట్టర్నే వరించింది. ఖట్టర్ కర్నాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.