రోడ్డు ప్రమాదంలో హీరోయిన్ హేమమాలినికి గాయలు... ఒకరి మృతి

గురువారం, 2 జులై 2015 (22:26 IST)
ప్రముఖ సినీనటి, బీజేపీ ఎంపీ, హేమమాలిని రాజస్థాన్, జైపూర్ లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రాజస్థాన్లోని దౌసా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆమె ప్రయాణిస్తున్నకారును మరో కారు ఢీకొనడంతో ఆమె గాయాలపాలయ్యారు. ఇదే ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. 
 
ఆగ్రా నుంచి జైపూర్ వెళుతుండగా వేగంగా వెళుతున్న కారును మరో కారు బలంగా ఢీకొనడంతో కార్లు బోల్తా పడి ప్రమాదం జరిగింది. రెండేళ్ల పాప చనిపోయింది అని ప్రాథమిక తెలుస్తోంది. హేమమాలినిని జైపూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స ఇప్పిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి