ముంబై పోలీసు హీరోగా ప్రశంసలు అందుకున్న ఏటీఎస్ చీఫ్ దివంగత హేమంత్ కర్కరే భార్య కవితా కర్కరే సోమవారం మెదడులో ఏర్పడిన రక్తస్రావం కారణంగా మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం తన నివాసంలోనే అపస్మారక స్థితిలో పడిపోయిన ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని హిందూజా ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆమె మృతి చెందినట్టు వారు అధికారికంగా వెల్లడించారు.
ఈ పరిస్థితుల్లో సోమవారం ఉదయం తన నివాసంలోనే అపస్మారక స్థితిలో పడిపోయిన కవితను హుటాహుటిన హిందూజా ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు.. బ్రెయిన్ డెడ్ అయినట్టు ప్రకటించారు. కర్కరే దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తన అవయవాలను వైద్య పరిశోధనలకు వినియోగించాలని కవిత కోరినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.