క్షతగాత్రులను ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో డ్రైవర్ బస్సులోంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సహాయ చర్యలను చేపట్టారు. మరోవైపు ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ సహాయక చర్యలను వేగిరం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులను ఆయన పరామర్శించారు.