గత యూపీఏ ప్రభుత్వ కాలంలో ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలు సిమ్లాలో కొంత భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమికి సంబంధించిన సమగ్ర వివరాలు అందజేయాలని సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు దేవాశీష్ భట్టాచార్య దరఖాస్తు చేశారు. ఈ మేరకు సమాచారం ఇవ్వాల్సిందేనన్న రాష్ట్ర సమాచార కమిషన్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ పరిస్థితుల్లో కేసు విచారణ శుక్రవారం జరిగింది. దీన్ని విచారించిన హైకోర్టు ప్రియాంకా గాంధీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. సదరు భూమికి సంబంధించిన వివరాలు ఎందుకు వెల్లడి చేయరాదో తెలపాలంటూ ఆ నోటీసుల్లో కోర్టు ప్రియాంకా గాంధీని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని అందులో పేర్కొంది.