హిందూ దేశంలో హిందూ ప్రజల జనాభా గణనీయంగా తగ్గిపోతోంది. అదేసమయంలో ముస్లింల జనాభా పెరుగుతోంది. ఈ విషయాన్ని కేంద్రం వెల్లడించింది. గత నాలుగు దశాబ్దాల కాలంలో హిందువుల సంఖ్య పెరిగినా శాతం పరంగా చూసినప్పుడు మాత్రం మూడు శాతం తగ్గినట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ జి.అహిర్ లోక్సభకు తెలిపారు.