కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ వివాదానికి తెరలేపారు. 'హిందు' అన్న పదం కనిపెట్టింది ముస్లింలేనని వ్యాఖ్యానించారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, మధ్యయుగంలో ఇండియాలో నివసిస్తున్న ప్రజలను ముస్లింల నుంచి వేరు చేసి చూపేందుకు ఈ 'హిందు' అన్న పదాన్ని ఉపయోగించారని తెలిపారు. వేదాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ 'హిందు' అన్న పదం ప్రస్తావనే లేదని అన్నారు.