S1 నుంచి S14 వరకు అన్ని బోగీల్లో దొంగలు.. షిర్డీ - మైసూర్ రైల్లో దోపిడీ!

బుధవారం, 27 మే 2015 (10:45 IST)
షిర్డీ నుంచి మైసూర్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు స్వైర విహారం చేశారు. ఏకంగా ఎస్ 1 నుంచి ఎస్ 14 వరకు ఉండే అన్ని రిజర్వేషన్ బోగీల్లో దొంగలు చొరబడి రైలులోని ప్రయాణికులందరినీ దోచుకున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని బాలాపూర్ వద్ద ఘటన చోటు చేసుకుంది.
 
మొత్తం 30 మందికి పైగా దొంగలు రైలులోని ఎస్ 1 నుంచి ఎస్ 14 వరకూ ఉన్న బోగీలన్నింటినీ దోచుకున్నారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా మొత్తం 14 బోగీల్లోని ప్రయాణికుల నుంచి డబ్బు, నగదును అందిన వరకు దోచుకుని పారిపోయారు. ఈ ఘటన గత అర్థరాత్రి 12 గంటల సమయంలో చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి