కావలసింది.. కట్నం. కానిస్టేబుల్ కాదు.. పోలీసైతే ఏంటి? చెప్పిన కట్నం తేవాలి కదా.. ఇదీ ఆ అమ్మాకొడుకుల తీరు. అడిగిన కట్నం తీసుకురాలేదని భర్త, అత్తమామలు కలిసి ఓ మహిళా పోలీసునే హతమార్చారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసే వరకట్న పిశాచానికి బలయ్యింది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన దారుణ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
మీరట్లోని ఖటౌలి ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ రేణుకి ఓ కంప్యూటర్ ఇంజినీరుతో ఏడాది క్రితం వివాహమైంది. కొంత కాలం వారి సంసారం బాగానే నడిచింది. అయితే కొన్నాళ్ళకు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. భర్త ఛీదరింపులు.. అత్తమామల సూటిపోటి మాటలతో నరకం అనుభవించింది. ఎంత పోలీసైనా తానూ ఓ ఇల్లాలునే అని ఆమె సర్దుకుపోవడం మొదలు పెట్టింది.