ఇరాక్, సిరియాల్లో మారణహోమం సృష్టిస్తున్న ఐఎస్ తీవ్రవాదులకు అనుంబంధంగా ట్విట్టర్ అకౌంట్ను నడుపుతూ పట్టుబడిన మెహదీ మస్రూర్ బిస్వాస్ వద్ద పోలీసులు జరిపిన విషయాల్లో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అతనిని గురువారం కోర్టులో హాజరుపరిచారు.
ఈ సందర్భంగా న్యాయవాదితో తీవ్రవాది బిశ్వాస్ మాట్లాడుతూ తానో సైనికుడినని, తాను చేసిన పనికి ఎంతమాత్రం పశ్చాత్తాపడటం లేదని చెప్పుకొచ్చాడు. ‘నేనో సైనికుడిని. మెసెంజర్ను కూడా. నేను చేసిన పనికి ఎంతమాత్రం పశ్చాత్తాపడటం లేదు’ అని చెప్పాడు.