కామోద్రేక పూరితమైన, మహిళలపై హింసాపూరితమైన కంటెంట్ను వారు వీక్షిస్తున్నారని తెలిపింది. భారత్ సైబర్ మార్కెట్ గణనీయమైన శక్తిగా ఉండటంతో దీనిపై సీమాంతర విద్రోహుల నుంచి తరచూ సైబర్ దాడులు జరుగుతున్నాయని పేర్కొంది.
ఒకవేళ పోర్నోగ్రఫీకి భారీ డిమాండ్ ఉండటంతో ఒక వెబ్సైట్ను బ్లాక్ చేసినా ఇంటర్నెట్ కంటెంట్ ప్రోవైడర్స్ వెంటనే వేరే వెబ్సైట్ను ముందుకుతెస్తున్నారని, అందువల్ల దీనిని నిరోధించడం కష్టంగా మారిందని కోర్టుకు సీబీఐ వివరించింది.