60 ఎద్దులు పరుగులు పెట్టేందుకు రెడీ.

మంగళవారం, 1 జనవరి 2019 (13:56 IST)
తమిళనాట సంక్రాంతి ప్రారంభమైనాయి. దాదాపు 60 ఎద్దులు పరుగులు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. అరియలూరు జిల్లా సాత్తాన్ కుప్పంలో జల్లికట్టు పోటీలు ఘనంగా ప్రారంభమైనాయి. వాటిని అదుపుచేసేందుకు 300 మంది యువకులు పోటీ పడ్డారు. ఈ పోటీలను తిలకించేందుకు వేలాది నంది తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. 
 
సుప్రీంకోర్టు నిబంధనలను మీరకుండా జల్లికట్టు జరుపుకోవచ్చునని.. జల్లికట్టు కారణంగా జంతువులను హింసించరాదని, పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎస్పీ గుప్తా తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు