తాను ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తుండగా, తన భద్రతా సిబ్బంది అధికార వాహనాల్లో ప్రయాణిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బాడీగార్డుల చేతిలోనే హత్యకు గురైయ్యారని గుర్తు చేసిన ఆమె, తన చుట్టూ ఉన్న భద్రతా సిబ్బంది కారణంగా తాను ఆందోళన చెందుతున్నానని ఆమె అభిప్రాయపడ్డారు.
నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత పది మంది పోలీసులతో రక్షణ కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు కేటాయించిన భద్రతా సిబ్బంది వివరాలు తెలపాలని ఆమె కేంద్రాన్ని కోరారు. భద్రతకు సంబంధించి తనకు లభించే హక్కులేమిటో చెప్పాలని ఆమె కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల కాపీ కూడా ఇవ్వాలని యశోదా బెన్ కోరారు.