అన్నాడీఎంకే జయలలితకు గుండెపోటు వచ్చింది. ఈ వార్త తెలియడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే చెన్నైలోని అపోలో ఆసుపత్రి దగ్గర లక్షలాది మంది అమ్మ అభిమానులు గుమికూడారు. దీంతో జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రితో పాటు.. చెన్నై నగర వ్యాప్తంగా భారీ సంఖ్యలో బలగాలను మొహరించారు. అంతేకాకుండా, కేంద్ర బలగాలను కూడా రప్పించి.. మొహరించారు. ముందు జాగ్రత్త చర్యగా అన్ని రకాల బందోబస్తు చర్యలు చేపట్టారు.
మరోవైపు... అమ్మ జయలలిత ఆరోగ్యం కుదటపడాలని ఆదివారం అర్థరాత్రి నుంచి తమిళనాడులో పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. సోమవారం అర్థరాత్రి చెన్నైతో పాటు తమిళనాడులోని పలు దేవాలయాల తలుపులు తీయించి పూజలు చేస్తున్నారు. రాత్రికిరాత్రి చెన్నైతో పాటు తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో రోడ్లలోనే హోమాలు చేస్తూ అమ్మ ఆరోగ్యం కుదటపడాలని ప్రార్థనలు చేస్తున్నారు.