బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందన్నారు. తెలంగాణలో బీజేపీకి ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు, ఓ ఎమ్మెల్సీ ఉన్నారని గుర్తు చేసిన లక్ష్మణ్.. అసెంబ్లీ మేం ఐదుగురం పంచపాండవులని అభివర్ణించారు. పంచపాండవుల తరహాలో ధర్మం పక్షనా నిలబడతామన్నారు.
ప్రజల పక్షాన ఉండి పోరాడతామని, తెలంగాణ అసెంబ్లీకి బీజేపీ అజెండా అనే నినాదంతో ముందుకు వెళతామని చెప్పారు. ‘‘ఉద్యమ కాలంలో, ఎన్నికల ముందు టీఆర్ఎస్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. కానీ, వాటి అమలుకు ప్రయత్నం చేయడం లేదని వెల్లడించారు.