భరతమాత ముద్దుబిడ్డ అబ్దుల్ కలాం : మంత్రి వెంకయ్య నాయుడు

మంగళవారం, 28 జులై 2015 (12:08 IST)
భరతమాత ముద్దుబిడ్డ అబ్దుల్ కలాం అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. అబ్దుల్ కలాం మృతిపై ఆయన స్పందిస్తూ... కాకతాళీయంగా సోమవారం మధ్యాహ్నమే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో మాట్లాడానని చెప్పారు. 
 
వచ్చేనెల 17వ తేదీన స్వర్ణభారతి ట్రస్టు కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరితే ఆయన అంగీకరించారు, మరోసారి ఆయన అపాయింట్మెంట్ ఖరారు చేసుకుందామని అనుకునేలోపు ఆయన మరణవార్త వినాల్సి రావడం బాధాకరమన్నారు. కలలు కని, వాటిని నిజం చేయడమే భరత మాత ముద్దుబిడ్డ అబ్దుల్ కలాంకు నిజమైన నివాళి అర్పించడమన్నారు.

వెబ్దునియా పై చదవండి