వచ్చేనెల 17వ తేదీన స్వర్ణభారతి ట్రస్టు కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరితే ఆయన అంగీకరించారు, మరోసారి ఆయన అపాయింట్మెంట్ ఖరారు చేసుకుందామని అనుకునేలోపు ఆయన మరణవార్త వినాల్సి రావడం బాధాకరమన్నారు. కలలు కని, వాటిని నిజం చేయడమే భరత మాత ముద్దుబిడ్డ అబ్దుల్ కలాంకు నిజమైన నివాళి అర్పించడమన్నారు.