1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకుబ్ మెమన్కు ఉరిశిక్ష అమలు నేపథ్యంలో మరణశిక్షపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రదాడులకు పాల్పడే నిందితులకు ఉరే శిక్ష వేయడం సబబే అని కొందరు అంటుంటే, మరి కొందరు మాత్రం ఈ శిక్షను రద్దు చేయాల్సిందేనని వాదిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ డీఎంకే చీఫ్ కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి స్పందించారు.