మంటల్లో ప్రైవేట్‌ బస్సు.. ఐదుగురు సజీవ దహనం.. ఎక్కడ?

బుధవారం, 12 ఆగస్టు 2020 (09:52 IST)
కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. విజయపుర నుండి 32 మంది ప్రయాణికులతో బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.

నాలుగో నంబరు జాతీయ రహదారిపై హరియూర్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సజీవ దహనమవగా, మిగిలిన వారికి గాయాలయ్యాయి.

మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఇంజిన్‌లో లోపం వల్లే బస్సులో మంటలు చెలరేగినట్టు హరియూర్‌ ఎస్‌పి వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు