కేరళలో చేతబడి నివారించేందుకు ఆ రాష్ట్ర సర్కార్ చట్టం తేనుంది. ఇటీవలి కాలంలో కేరళలో నరబలులు పెరిగిపోవడం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకూ చేతబడి, తాంత్రిక పూజల కేసులు పెరిగిపోతుండటంతో, వీటిని ఆపేందుకు కఠిన చట్టాన్ని తీసుకురావాలని కేరళ ప్రభుత్వం యోచిస్తోంది.