శనివారం జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాద దాడిలో 8 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృత్యువాత పడ్డారు. ఈ విషయం న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్కు కూడా సమాచారం వచ్చింది. ఆ సమయంలో ఆయన ఇఫ్తార్ విందులో ఉన్నారు. అపుడు అక్కడ వున్న ఓ విలేకరి ఈ దాడిపై స్పందించాలని కోరారు. దీనికి ఆయన ఏవిధంగా సమాధానం ఇచ్చారో చూడండి.
'ఇది రంజాన్ నెల. ఇఫ్తార్ పార్టీ మీద దృష్టిపెడదాం. జమ్మూ-కాశ్మీరు సమస్యపై భారతదేశం, పాకిస్థాన్ మధ్య వివాదం జరుగుతోంది. దీనిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. చర్చించి, పరిష్కారం కనుగొనగలమని ఆశిస్తున్నాం. భారత్, పాకిస్థాన్ సంబంధాల గురించి ఇదివరకే చెప్పాను. ఈరోజు మనం ఇఫ్తార్ ఆనందంగా జరుపుకుందాం.ఇఫ్తార్ పార్టీ చేసుకుని మనం సంతోషిద్దాం' అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.