మధ్యప్రదేశ్లో జరిగిన రెండు ఘోర రైలు ప్రమాదాల్లో ఇప్పటి వరకూ 20 మంది మరణించారు. మాచక్ నదిలో కామయాని ఎక్స్ప్రెస్ 10 బోగీలు పడ్డాయి. కామాయని, జనతా ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలు తప్పడం వల్ల 20 మంది మరణించారని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. వివరాలిలా ఉన్నాయి.
ప్రయాణికుల్లో చాలామందిని రక్షించి, ఇటార్సీ రైల్వేస్టేషనుకు తరలించామని రైల్వేఅధికారులు వివరించారు. ఈ సంఘటనలో 300 మంది ప్రయాణికులను స్థానికులు కాపాడారు. హర్దాకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ముంబయి నుంచి వారణాసి వెళుతున్న కామయాని ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది.