బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు నితీశ్కు ఫోన్లు చేసిమరీ తమ అభినందనలు తెలిపారు.
అలాగే, బీహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్న సీఎం నితీశ్ కుమార్కు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నితీశ్కు ఫోన్ చేసిన చంద్రబాబు ఎన్నికల్లో విజయం పట్ల ఆయనకు అభినందనలు తెలిపారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా నితీశ్ కుమార్కు అభినందనలు తెలిపారు. బీహార్లో మహా కూటమి విజయం అభివృద్ధికి ప్రజలు కట్టబెట్టిన విజయమని వ్యాఖ్యానించారు.