తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేమని ఆమెకు వైద్యం అందించే వైద్యుల్లో ఒకరైన లండన్కు చెందిన డాక్టర్ రిచర్డ్ బీలే వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన సోమవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
జయలలిత ఆరోగ్యం చాలా విషమంగా ఉందన్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిని ప్రస్తుతం మిగతా వైద్యులతో కలిసి తాను కూడా సమీక్షిస్తున్నట్లు చెప్పారు. అధునాతన వైద్య పరికరాల సాయంతో ఆమెకు చికిత్స అందుతోందని చెప్పారు. అపోలో వైద్యులతో పాటు ఎయిమ్స్ వైద్యులు కూడా ఆమెకు చికిత్స అందిస్తున్నారని ప్రకటన చేశారు.