వివరాల్లోకి వెళితే కరమ్జిత్కౌర్ (40) భర్త బీందర్ సింగ్ ఎనిమిది సంవత్సరాలుగా దుబాయ్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వీరికి 17,19 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు కుమారులున్నారు. కరమ్జిత్ తన ఇద్దరు కుమారులతో గ్రామంలోనే ఉంటోంది.
అయితే కరమ్జిత్ అదే గ్రామంలోని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న కుమారులు ఆమెను ఇంటికే పరిమితం చేశారు. కానీ ఈ విషయంపై తల్లీ కొడుకుల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఎంతచెప్పినా తల్లి పట్టించుకోకపోవడంతో.. తల్లి వైఖరి మారదనుకున్న ఆ కుమారులు గురువారం తెల్లవారుజామున 4 గంటలకు నిద్రిస్తున్న సమయంలో ఆమెపై కొడవలితో దాడిచేసి చంపేసి పరారైనారు.