ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. కేవలం అభివృద్ధిలోనేకాకుండా, సాంకేతికంగా కూడా ముందుకు దూసుకెళుతోంది. కానీ, కొన్ని చోట్ల మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. తమ నిజాయితీని నిరూపించుకునేందుకు ఐదుగురు చిన్నారులు కాగుతున్న నూనెలో చేతులు పెట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నార్సింగ్పాద అనే మారుమాల గ్రామం ఉంది. ఈ ప్రాంతానికి చెందిన చంగన్లాల్ అనే వ్యక్తి కుమారుడి ఫోన్ చోరీకి గురైంది. తన కుమారుడి ఫోన్ ఎవరు తీశారో తెలుసుకునేందుకు ఆ వ్యక్తి తన వద్ద పని చేసే చిన్నారులపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. వేడినూనెలో చేతులు కాలకపోతే నిజాయితీపరులని, కాలితే దొంగలని చెప్పాడు.