సాధారణంగా మనుషులు తమకు ఇష్టమైన కుక్కలు, పిల్లులు, పక్షులు వంటివి పెంచుకుంటారు. కానీ, మధ్యప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉంటున్న ఓ మహిళా ప్రజాప్రతినిధికి ఓ వింత ఆలోచన వచ్చింది. అదేంటంటే.. పులిని పెంచుకోవాలన్న ఆశ. అంతే.. ఆమె ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా అటవీశాఖకు దరఖాస్తు చేసుకున్నారు.
పులులను పెంచుకునే వెసులుబాటు ఉన్న కారణంగా థాయ్లాండ్ వంటి దేశాల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్న కుసుమ్, మన దేశంలో ఆ తరహా సౌకర్యం లేని కారణంగానే నానాటికీ పులుల సంఖ్య తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో పులుల సంఖ్య తగ్గిపోతోందన్న భావనతోనే కుసుమ్, కేంద్రం చర్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఈ లేఖ రాశారట. ఇదిలావుంటే, ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న పన్నా నియోజకవర్గంలోని అభయారణ్యంలో పులుల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిందని అజయ్ దూబే చెబుతున్నారు.