కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన బాధితురాలు నిర్మాణ పనుల కూలీగా పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. అంబేద్కర్ విగ్రహం వీధిలో బాధితురాలి చీరను నిందితులు లాగారు. ఆ తర్వాత ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నించారు. అంతేగాక తమతో గడిపేందుకు రూ. 2వేలు ఇస్తామని నిందితుల్లో ఒకడు ఆమెకు చెప్పాడు.