సీఎం పీఠం కోసం శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గళం విప్పిన మరునాడే ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్, శివసేన నేతనే సీఎం పీఠం అధిష్ఠిస్తారంటూ వ్యాఖ్యానించారు. రౌత్ వ్యాఖ్యలపై బీజేపీ వెనువెంటనే స్పందించింది. రౌత్ ను చోటా నేతగా అభివర్ణించిన బీజేపీ, తమ పార్టీ అభ్యర్థే సీఎం పీఠంపై కూర్చుంటారని తేల్చిచెప్పింది.
కాగా వచ్చే నెలలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ - ఎన్సీపీ పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ఓ మరాఠీ చానెల్ నిర్వహించిన ముందస్తు సర్వేలో వెల్లడైంది. మొత్తం 288 సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ 103, శివసేన 64 చొప్పున సీట్లు వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్ - ఎన్సీపీ కూటమికి కేవలం 65 సీట్లు దక్కవచ్చని తెలిపింది.