కుమార్తెను ప్రేమించాడనీ సుత్తితో చితక్కొట్టారు....

మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (14:26 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తమ కుమార్తెను ప్రేమించాడన్న అక్కసుతో తండ్రీకొడులు ఓ యువకుడిపై దాడి చేశారు. అదీ కూడా సుత్తితో తీవ్రంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. 
 
ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, మ‌ధ్య‌ప్ర‌దేశ్ షాజ‌పూర్ జిల్లాలోని మాక్సి సిటీకి చెందిన పుష్ప‌క్ భ‌వ్‌సార్ (22) అనే యువకుడు స్థానికంగా ఓ యువ‌తిని గ‌త కొంత‌కాలం నుంచి ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాల‌ని నిశ్చయించుకున్న ఆ ఇద్ద‌రూ.. ఇంట్లో ఎవ‌రికీ చెప్ప‌కుండా వెళ్లిపోయారు. 
 
ఈ వ్యవహరంపై ఇరు కుటుంబాల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్ద‌రూ విడివిడిగా ఉండేందుకు పెద్ద‌లు నిర్ణ‌యించారు. దీంతో ఆ ప్రేమికులిద్ద‌రూ తిరిగి త‌మ నివాసాల‌కు చేరుకున్నారు. త‌న బిడ్డ‌ను తీసుకొని వెళ్లిపోయిన పుష్ప‌క్‌పై అమ్మాయి తండ్రి, సోద‌రుడు తీవ్ర ఆగ్ర‌హంతో ఊగిపోయారు. 
 
ఈ క్రమంలో ఆదివారం మార్కెట్‌కు ఒంటరిగా వ‌చ్చిన పుష్ప‌క్‌ను ప‌ట్టుకుని సుత్తితో దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. ఈ దృశ్యాల‌ను కొంద‌రు త‌మ మొబైల్స్‌లో చిత్రీక‌రించి వైర‌ల్ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై మాక్సి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

 

A 22-year-old man was brutally beaten up in Shajapur The woman's father and brother, allegedly angry over the affair, on Sunday confronted the man while he was out in the market and allegedly started beating him up with hammer-shaped rod. pic.twitter.com/GTrQ9JvMKp

— Anurag Dwary (@Anurag_Dwary) September 13, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు