వివాహానికి ఒప్పుకోలేదనే కోపంతో ఒక మహిళను కారులోనుండి తోసేశాడో దుర్మార్గుడు. ఈ సంఘటన ఆగ్రా-ఢిల్లీ జాతీయ రహదారిపై జరిగింది. మథురకు చెందిన యువతి ఆగ్రా-ఢిల్లీ జాతీయ రహదారిపై గల ఒక ఏటీఎంలో డబ్బు తీసుకోవడానికి వెళ్తుండగా ఆమెను ఒక వ్యక్తి కారులో వెంబడించాడు. కొద్ది దూరం వెళ్లిన తరువాత ఆ యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించాడు. ఆమెను ఇష్టపడుతున్నానని చెప్పి వివాహనికి ఒప్పుకోవాలని బలవంతపెట్టాడు. దీనికి ఆ యువతి ససేమిరా అంగీకరించలేదు.
పోలీసులు ఆమెను వెంటనే అక్కడకు చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం యువతి మధురలో స్వర్ణ జయంతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆ యువతి ఒక పోస్ట్-గ్రాడ్యుయేట్, మార్చి 2016 వరకు ఒక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేశారు.ఆమెను గాయపరిచిన ఆగంతకుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.