వియ్యంకులు కాబోతున్న లాలూ ప్రసాద్ - ములాయం సింగ్!

శుక్రవారం, 28 నవంబరు 2014 (11:56 IST)
బీహార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులైన లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్‌లు త్వరలో వియ్యంకులు కాబోతున్నారు. ములాయం సింగ్ యాదవ్ మనవడు తేజ్ ప్రతాప్, లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కూతరు రాజలక్ష్మికి వివాహం కుదిరింది. డిసెంబర్‌లో నిశ్చితార్థం జరుగనుంది. ఇందుకోసం ఇరుకోసం ఇరు కుటుంబాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. 
 
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన తాత ములాయం సొంత నియోజకవర్గం మెయిన్ పురి నుంచి బరిలోకి దిగిన తేజ్ ప్రతాప్ పార్లమెంట్‌లో తొలిసారిగా అడుగుపెట్టిన విషయం తెల్సిందే. ఈ నేతలిద్దరూ ఒకే సామాజికి వర్గానికి చెందినా... రాజకీయాల్లో మాత్రం బద్ధ శత్రువులుగానే కొనసాగుతూ వచ్చారు. ఈ పెళ్లి ఈ యాదవ్ నేతల మధ్య రాజకీయ స్నేహానికి నాంది పలుకనుంది. 

వెబ్దునియా పై చదవండి