దీంతో డోంకుపర్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే ఆ ఆరోపణలు అవాస్తవమని, తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని రాయ్ తేల్చి చెప్తున్నారు. అటువంటి తప్పు తాను చేయనని, ఆ గెస్ట్ హౌస్ను తాను నిర్వహించడం లేదని రాయ్ పేర్కొన్నారు. వాస్తవాలను వెలికి తీసే విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఉందని, పూర్తి స్థాయిలో విచారణ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.