జమ్మూకాశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రిగా పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ నియమితులు కానున్నారు. శ్రీనగర్లో సమావేశమైన ఆ పార్టీ శాసనసభాపక్షం ఆమెను శాసనసభా నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ మేరకు రాజ్భవన్లో గవర్నర్ ఎన్ఎన్ ఓహ్రాను కలిసి లేఖ అందించారు. దీంతో 53 యేళ్ల మెహబూబా రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి కావడం లాంఛనం కానుంది.