దేశంలోని మొబైల్ యూజర్ల వివరాలు సేకరించాల్సిందే : సుప్రీంకోర్టు

సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (18:43 IST)
దేశంలోని మొబైల్ యూజర్ల వివరాలు సేకరించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం దేశంలో 100 కోట్లకు పైగా మొబైల్ యూజర్లు ఉన్నార‌ు. ప్రతి యూజర్ గుర్తింపున‌కు సంబంధించిన వివరాలను ఏడాది లోపు సేకరించాలని కేంద్ర ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
మొబైల్ నంబర్లకు తప్పనిసరిగా ఆధార్ నెంబ‌రును అనుసంధానం చేయాలని, వారి వివరాలు సేకరించేందుకు సరియైన మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ప్రీ పెయిడ్ సిమ్ కార్డుల గుర్తింపున‌కు సంబంధించి కూడా వివరాలు తీసుకోవాల‌ని కోర్టు తెలిపింది. 
 
మొబైల్ వినియోగ‌దారుల వెరిఫికేషన్ అనేది ఎంతో ప్ర‌ధాన‌మైంద‌ని, దేశంలో ఇప్పుడు బ్యాంకింగ్ కార్యకలాపాలకు మొబైల్ ఫోన్లనే వాడుతున్నారని, అందువల్ల విధిగా వారి వివరాలను సేకరించాల్సిందేనంటూ ఎన్జీఓ లోక్ నీతి ఫౌండేషన్ దాఖలుచేసిన పిటిష‌న్ మేర‌కు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 
 

వెబ్దునియా పై చదవండి