వధువు కోసం వేచిచూసి ఓ వరుడు విసిగిపోయాడు. అంతేగాకుండా రాత్రి విందు భోజనం మాత్రం తీసుకుని ఇంటికెళ్లిపోయాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. తమిళనాడులోని ఆర్కాడుకు చెందిన సురేష్ (27)కు వేలూరుకు చెందిన ఓ అమ్మాయితో పెద్దలచే వివాహం కుదిరింది. పెళ్లికి ముందు రోజు రిసెప్షన్ కోసం వరుడు తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఓ దేవాలయంలో వేచి చూశాడు.
వధువు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సామాజిక సంక్షేమ శాఖకు ఫిర్యాదు చేయడంతో.. ఆ శాఖకు చెందిన అధికారులు వధువు తల్లిదండ్రులను బంధువులను హెచ్చరించడంతో వివాహాన్ని ఆపేశారు. ఈ విషయం తెలుసుకున్న వరుడు, ఆతడి కుటుంబీకులు విందు భోజనం లాగించి, తట్టా బుట్టా సర్దుకుని సొంతూరు వెళ్లిపోయాడు.