బీహార్లో సోమవారం రాత్రి భీకర దాడి చోటుచేసుకుంది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వసతుల లేమిపై విరుచుకుపడ్డ స్థానికులు సంసారంలో ప్రభుత్వ అధికారులపై దాడి చేయడంతో పాటు, ఆ రాష్ట్ర మంత్రిని సజీవ దహనం చేసేందుకు యత్నించారు. దీంతో వేదిక కింద దాదాపు 2 గంటల పాటు దాక్కున్న సదరు కేబినెట్ మంత్రి బతుకు జీవుడా అంటూ వ్యక్తిగత సిబ్బంది సహాయంతో బయటపడ్డారు.
స్వతహాగా కళాకారుడైన రాష్ట్ర కళలు, సాంస్కృతిక శాఖ మంత్రి వినయ్ బిహారీ కార్యక్రమంలో భాగంగా కొన్ని భక్తి గీతాలు ఆలపించారు. ఈ క్రమంలోనే ఏర్పాట్లు సరిగా లేవంటూ కొందరు స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేదికపైకి కుర్చీలను విసిరేశారు.