ఐస్ బకెట్ ఛాలెంజ్లా స్వచ్ఛ్ భారత్ వ్యాపిస్తోంది. మొన్నటిదాకా ఐస్ బకెట్ ఛాలెంజ్లో భాషా బేదం లేకుండా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్, కోలీవుడ్ సెలేబ్రిటీలు పాల్గొన్నారు. ఇప్పుడు తాజాగా దేశంలోని తొమ్మిది మంది సెలెబ్రిటీలకు ప్రధాని మోడీ సవాల్ విసిరారు.
నరేంద్ర మోడీ సవాల్ విసిరిన ఆ సెలేబ్రిటీలు కమల్ హాసన్, సల్మాన్ ఖాన్, ప్రియాంకా చోప్రా, శశిథరూర్, సచిన్ టెండూల్కర్, తారక్ మెహతా, అనిల్ అంబానీ, మృదులా సిన్హా, బాబా రాందేవ్లు ఉన్నారు.