తూర్పు చంపారన్ జిల్లాలోని సెమ్రా, సుగౌలి రైల్వే స్టేషన్ల మధ్య ఆటోరిక్షా రైల్వే గేట్ను దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చనిపోయిన వారంతా చినౌతా గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. తమ కులదైవ ఆలయంలో పూజలు నిర్వహించి తిరిగి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. గేట్మెన్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. .
రైలు ప్రమాద ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ. 1.5 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. రైల్వే శాఖ మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. లక్ష పరిహారంగా ప్రకటించింది.
అలాగే, ఈ ప్రమాదానికి బాధ్యులుగా భావించి, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సెమ్రా సూపరింటెండెంట్, లెవల్ క్రాసింగ్ వద్ద ఉన్న గేట్మెన్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశారు.