అయితే, గత కొంతకాలంగా తీరిక లేకుండా ఉన్న మోడీ ప్రస్తుతం కాస్త విరామం తీసుకుని శనివారం బేలూరు మఠానికి వెళ్లనున్నారు. దీనిపై మఠానికి చెందిన అసిస్టెంట్ సెక్రటరీ సుబీర్నందా మహారాజ్ మాట్లాడుతూ 'మోడీగారూ ఆత్మస్థానంద్ మహారాజ్ను గురువుగారిగా భావిస్తారు. ఎప్పటి నుంచో ఆయనను కలుసుకోవాలనుకుంటున్నారు. గతకొంతకాలంగా ఆస్పత్రిలో ఉంటున్నారు. రాజ్కోట్లో కలిసి ఉన్నప్పుడు ఆత్మస్థానంద్ మహారాజ్గారి సలహాలు మోడీ తీసుకునేవారు' అని చెప్పారు.