కుమార్తెను వేధిస్తున్న ఓ వ్యక్తిని ముంబై మహిళ 22 రోజుల తర్వాత పోలీసులకు అప్పగించింది. దక్షిణ ముంబై కళాశాలలో చదువుతున్న యువతిని జనవరి 30న అదే సబ్ వేలో వేధించాడు. జరిగిన విషయాన్ని ఆ యువతి.. ఆమె తల్లితో చెప్పింది. ఇంకా ఆ యువకుడు ఎలా ఉంటాడో చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి అదే ప్రాంతంలో మధ్యాహ్న సమయంలో కాపు కాసిన ఆ మహిళ.. 22 రోజుల నిరీక్షణ అనంతరం తిరిగి అదే స్టేషన్లో పట్టుకుంది.