ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అధికార సమాజ్వాదీ పార్టీలో సంక్షోభం తారాస్థాయికి చేరింది. వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ పార్టీపై పట్టుకోల్పోతున్నారు. దీంతో పార్టీ నేత అమర్సింగ్తో కలిసి సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలో ఎన్నికల సంఘంతో భేటీ కానున్నారు. పార్టీ రెండుగా చీలిపోయిన నేపథ్యంలో సైకిల్ గుర్తును కాపాడుకునేందుకు ములాయం ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు.. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతేనా, దీంతో పాటు బాబాయ్ శివ్పాల్ యాదవ్పై వేటువేశారు. దీంతో పార్టీ నిలువునా చీలిపోయింది. ఈ చర్యతో షాక్కు గురైన ములాయం సింగ్ యాదవ్... ఈనెల 5వ తేదీని నిర్వహించాలని తలపెట్టిన సమావేశాన్ని రద్దు చేసినట్లు సోమవారం ఉదయం ప్రకటించారు. ఈ వారంలో యూపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులు వారి స్థానాలకు వెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.