అమీర్ ఖాన్ అలా ఎందుకన్నారో కేంద్రం మాట్లాడి తెలుసుకోవాలి... ములాయం సింగ్

బుధవారం, 25 నవంబరు 2015 (15:55 IST)
అమీర్ ఖాన్ అసహనం వ్యాఖ్యలపై దేశంలో సెలబ్రిటీలు, సామాన్యులు, నాయకులు ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. కొందరు విమర్శిస్తుంటే మరికొందరు ఆయనకు బాసటగా నిలుస్తున్నారు. తాజాగా సమాజ్ వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఈ వ్యవహారంపై మాట్లాడారు. అమీర్ ఖాన్ సున్నితమైన విషయాన్ని బయటకు చెప్పారంటే ఎక్కడో ఏదో ఆయనను బాధ పెట్టిన ఘటన జరిగి ఉంటుంది. 
 
అసలీ విషయంపై కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండకుండా ఆయనతో మాట్లాడి అసలు విషయమేమిటో తెలుసుకోవాలి. స్వతంత్ర భారతదేశంలో ఎవరి మనసులో ఏమున్నా నిర్భయంగా చెప్పే హక్కు ఉన్నది. అలాగే అమీర్ ఖాన్ తన భార్య ఏమనుకుంటున్నారో బయటి లోకానికి వెల్లడించారు. అందులో తప్పేముంది... ఐతే వారలా అనుకోవడానికి వెనుక ఉన్న కారణమేమిటో ప్రభుత్వం తెలుసుకోవాలని ములాయం సింగ్ యాదవ్ సూచించారు. మరి ప్రభుత్వం అమీర్ ఖాన్‌ను పిలిపించి ఆయనలా ఎందుకు అనాల్సి వచ్చిందో అడిగి తెలుసుకుంటుందా... చూడాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి