వివరాల్లోకి వెళితే.. కల్యాణ్ ప్రాంతంలో రాజేంద్ర షిండే(45), సంగీత(42) భార్యభర్తలు. వీరికి చేతన్ (19) అనే కుమారుడు, పదేళ్ల కూతురు ఉంది. వ్యాపార వేత్తగా పనిచేస్తున్న రాజేంద్ర షిండేకు భార్యపై అనుమానం ఎక్కువైంది. ప్రతిరోజూ దీనిపై గొడవపడుతూ ఉండేవాడు. అంతేగాకుండా భార్యను అనుమానంతో హతమార్చాలని డిసైడ్ అయ్యాడు. పక్కా ప్లాన్ ప్రకారం.. భార్యపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆమె కేకలు పెట్టడంతో చేతన్ వేగంగా పరిగెత్తుకొచ్చి తలుపులు కొట్టాడు.
ఆదివారం మధ్యాహ్నం తన ప్లాన్ అమలు చేయాలనుకున్నాడు. కొడుకు చేతన్ బయటకు వెళ్లగానే భార్యపై కత్తితో దాడికి దిగాడు. కత్తిపోట్లకు ఆమె కేకలు పెట్టడంతో చేతన్ వేగంగా పరుగెత్తికొచ్చి తలుపుకొట్టాడు. డోర్ తలుపులు తెరవకపోవడంతో బాత్రూమ్ రూమ్ కిటికీలను పగులకొట్టి అందులో నుంచి లోపలికి వచ్చాడు. అది గమనించిన రాజేంద్ర షిండే భయంతో వేగంగా బాల్కనీ పైకెళ్లి అక్కడి నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం సంగీత ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.